రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణ మేధావుల మధ్య చర్చలు

నీటి వనరులు, హైదరాబాద్, ఉద్యోగాలు, తెలుగుభాష, సాధికార అభివృద్ధి వంటి ప్రధాన అంశాలపై సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు. ఈ అంశాలపై పరిష్కరించుకొంటే ప్రస్తుత సందిగ్ధత తొలగిపోయి, అన్ని ప్రాంతాలు ప్రశాంతతతో కూడిన అభివృద్ధి బాటపడుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉండాలని, విభజన జరిగిన అనంతరం 15 ఏళ్లపాటు సీమాంధ్రకు కూడా ఈ నగరమే రాజధానిగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తెలంగాణ ప్రాంతం నుంచి సుముఖత ఉంటుందా? లేదా? అనేది చర్చించాల్సి ఉందని భావించారు. విభజన తర్వాత హైదరాబాద్లోనే ఉండాలని కోరుకొనే ఉద్యోగులకు పదేళ్లు ఇక్కడే ఉండే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. మరో మూడు నాలుగు సార్లు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని ఇరుప్రాంతాల మేధావులు, నేతలు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications