రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు పెరుగుతున్న మద్దతు: చెంతకు జ్యోతుల, దొరబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లాలో మద్దతు క్రమంగా పెరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఇప్పటికే జగన్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. పీఆర్పీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జ్యోతుల నెహ్రూ గతంలోనే జగన్ పార్టీలోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన రాక ఖరారు అయింది. ఇటీవలె శాసనమండలిపై ఆశ పెట్టుకున్న పీఆర్పీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మ కూడా జగన్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. వారం రోజుల క్రితమే ఆమె ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చిరంజీవికి రాజీనామాను అందచేశారు.

భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యుడు పెండెం దొరబాబు, పీఆర్పీకే చెందిన జివివి రమణ, అత్తిలి రామస్వామి తదితరులు సైతం జగన్‌కు అండగా రావడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం జగ్గంపేటలో జరిగే జగన్ బహిరంగ సభకు వీరు హాజరయి తమ మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించడానికి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి గురువారం జగ్గంపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రముఖ నేతలు జగన్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా జగన్ పక్షాన ఉన్నారన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy is getting support from former MLA Dorababu, Jyothula Nehru and Vasireddy Padma from East Godavari. Jagan's strength will grown up with them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X