హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులపై అసెంబ్లీలో తీవ్ర రగడ, వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్ ఆస్తులపై బుధవారం శాసనసభ అట్టుడికింది. వైయస్ జగన్ అక్రమాస్తులపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పట్టుబట్టారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించకపోవడంతో తెలుగుదేశం ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో డిప్యూటీ స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

జగన్ ఆస్తుల గొడవతో శాసనసభ సమావేశం ప్రారంభమైన కాసేపటికే అరగంట వాయిదా పడింది. ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ విపక్షాలు కోరిన వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. సభలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ సభ్యులు జై తెలంగాణ నినాదాలు చేశారు. చర్చించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగించవలసిందని ఉపసభాపతి మంత్రులను కోరారు. అయినా జగన్ ఆస్తులపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టు పట్టారు.

కడప, హైదరాబాద్‌లలో నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులపై చర్చకు పట్టుపట్టింది. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని, సహకరించాలనని సభ్యులను కోరిన ఉప సభాపతి ఫలితం లేకపోవడంతో సభను అరగంట వాయిదా వేశారు.

English summary
Assembly adjourned for 30 minutes, as TDP members stalled the proceedings demanding debate on YS Jagan's properties. TDP members not yielded to the suggestion of Deputy Speaker Nadendla Manohar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X