కూతురు శ్రీజ వివాదంతో మెగస్టార్ చిరంజీవికి తలనొప్పి
కాంగ్రెసు పార్టీలో చిరంజీవికి అతి ముఖ్యమైన స్థానం లభిస్తుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చిరంజీవికి అనూహ్యమైన స్థానం లభిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇటీవల అన్నారు. ఇటువంటి సందర్భంలో తన భర్త శిరీష్ భరద్వాజ్పై శ్రీజ వరకట్నం వేధింపుల కేసు పెట్టడం చిరంజీవికి ఇబ్బంది కలిగించే విషయమే. అయితే, చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు శిరీష్ను తన అల్లుడిగా స్వీకరించడానికి ముందుకు రాలేదని అంటున్నారు. శ్రీజ చిరంజీవి ఇంటికి వస్తూ పోతూనే ఉన్నది. గత కొంత కాలంగా ఆమె చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నట్లు కూడా చెబుతున్నారు.
చిరంజీవి తనను స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో శిరీష్ భరద్వాజ్ అహం దెబ్బ తిందని అంటారు. కూతురును ఆహ్వానించినప్పటికీ తనను చిరంజీవి దూరంగానే ఉంచుతారనే విషయం భరద్వాజ్కు అర్థమైందని చెబుతున్నారు. కాగా, ప్రేమ పెళ్లి వల్ల తండ్రి చిరంజీవి ఎంతగా బాధపడ్డారో, ఎంత కోపంగా ఉన్నారో వీలు దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులు శ్రీజకు క్లాస్ తీసుకోవడం ప్రారంభించారట. ఈ స్థితిలోనే శ్రీజ భర్తకు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతారు.