జగన్ వర్గానిది రాజకీయ వ్యభిచారం, ఎన్నికల్లో తేల్చుకోండి: దేవినేని ఉమ

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ విజయవాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన జగన్ వర్గం నేతలు ఇప్పుడు జగన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయనకే మద్దతు పలకడం రాజకీయ వ్యభిచారమే అనిపించుకుంటుందని ఆన్నారు. జగన్ పార్టీ సమాధుల్లో కలవడం ఖాయమని ఆయన అన్నారు.

జగన్ వర్గం నేతలు ముందుగా తాము ఎవరిని ఎన్నుకుంటారో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఈ నెల 17న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారో మొదట వారు చెప్పాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై సుప్రీంకోర్టులో కేసు వేసి ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు అబద్ధమని తెలిసే దానిని ఉపసంహరించుకున్నారన్నారు. జగన్ అక్రమాలపై ప్రభుత్వం జెఎల్పీ వేసే వరకు సభను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+