వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సయోధ్యకు ఆజాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gulam Nabi Azad
న్యూఢిల్లీ‌: పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగుతున్నారు. వీరప్ప మొయిలీ స్థానంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా ఆజాద్ నియమితులైన విషయం తెలిసిందే. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలరనే పేరు ఆయనకు ఉంది. తన పనిని ఆజాద్ రాష్ట్ర పార్లమెంటు సభ్యుల నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆయన మొదట పూనుకుంటున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రాంతాలవారీగా విడిపోయారు. పరస్పరం మాట్లాడుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ స్థితిలో ఆజాద్ రంగంలోకి దిగుతున్నారు.

ఈ నెల 22వ తేదీ ఉదయం గులాం నబీ ఆజాద్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. అదే రోజు సాయంత్రం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమవుతారు. మర్నాడు ఈ నెల 23వ తేదీన ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులను కలిపి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ విషయంపై పార్టీ అధిష్టానం ఉద్దేశం ఎలా ఉందనేది ఆయన సూచనప్రాయంగా వారికి చెప్పే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన సూచించే అవకాశం ఉంది.

కాగా, ఐదు రాష్ట్రాల శానససభల ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ అంశంపై దృష్టి పెడతామని కాంగ్రెసు అధిష్టానం చెబుతోంది. అప్పటి వరకు వేచి చూడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులున్నారు. మేలో తెలంగాణపై కసరత్తు చేసి కాంగ్రెసు అధిష్టానం జూన్‌లో నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం.

English summary
Congress Andhra pradesh affairs incharge Gulam Nabi Azad is prepared to solve problems in state party. He is organising meeting with Telangana and Seemandhra MPs seperately on March 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X