రామోజీ రావుపై వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేల ఎదురు దాడి
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో1995 నుంచి 2004 వరకు రామోజీ రావు సంస్థలు లాభపడిన తీరుపై కూడా విచారణ జరిపించాలని వారు కోరారు. మార్గదర్శి వంటి పలు అక్రమ వ్యవహారాలు రామోజీ నడిపారని వారు అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తాకథానాలను ఆధారం చేసుకుని శాసనసభలో ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి తగదని వారన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కమ్మక్కయ్యాయని, ఈ స్థితిని చూస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుందని వారన్నారు. తమ నాయకుడిపై ఆరోపణలు చేసినందుకు ప్రతిగా తాము ఆరోపణలు చేయడం లేదని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పలు అక్రమాలు జరిగాయని, అవి కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని వారన్నారు.
వైయస్ జగన్కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జగన్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు. జగన్కు వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనాల ఆధారంగా తెలుగుదేశం పార్టీ స్పందిస్తోందని, అది సరి కాదని వారన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు కాంగ్రెసులో విలీనం చేస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.