వెనక్కి తగ్గిన జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలు, కాంగ్రెసుకే ఓటు

YS Jagan
హైదరాబాద్‌: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆశలు సన్నగిల్లినట్లేనని చెప్పవచ్చు. తమ పార్టీ అభ్యర్థి బరిలో లేనందున కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీన్ని బట్టి గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేస్తున్న కసరత్తు ఫలించినట్లేనని చెప్పాలి.

శాసనసభ్యుల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తన మిత్ర పక్షాల అభ్యర్థులతో కలిపి ఏడు స్థానాలకు పోటీ చేస్తోంది. తెలుగుదేశం నాలుగు స్థానాలకు పోటీ చేస్తోంది. 11 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్న తెరాస కూడా ఒక్క సీటుకు పోటీ చేస్తోంది. పది స్థానాలకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రేపు గురువారం జరగనుంది. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల వల్ల లాభపడవచ్చుననే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అదనంగా ఓ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు, తెరాస తన అభ్యర్థిని పోటీకి పెట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత పరిణామం తెలుగుదేశం పార్టీకి, తెరాసకు తీవ్రమైన దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.

గత రెండు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమవుతున్నారు. మంగళవారం వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమయ్యారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని తమ వైపు తిప్పుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+