వైయస్ జగన్ వెంట సంఘ విద్రోహ శక్తులు: ఆనం వివేకానందరెడ్డి

కాగా ప్రజాపద్దుల సంఘం సమావేశంపై కూడా ఆయన స్పందించారు. నాగం జనార్ధన్ రెడ్డి సమావేశాన్ని అకస్మాత్తుగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన ఉద్దేశ్యం బయట పెట్టాలన్నారు. నాగం ఏర్పాటు చేసిన సమావేశానికి మేం వెళ్లమని చెప్పారు. ఆయన ఎవ్వరినీ నోరెత్తనివ్వరని అన్నారు. అయినా చైర్మన్ నోటిఫికేషన్ వచ్చినందున ఆయన పదవి ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా సీమాంధ్ర సభకు రానని ప్రకటించి నాగం పిఎసి సమావేశం ఎలా పెడతారని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. రేపు సమావేశంలో ఈ అంశం లేవనెత్తుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications