వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎంకె ఎంపీలతో చిరు చర్చలు: తమిళనాడులో ప్రచారంపై వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్సు ఇవ్వాల్సిందిగా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు, దానితోపాటు తెలంగాణలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని చిరంజీవి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన రాయితీల్లో కోత విధించవద్దని ఆయన కోరారు.

కాగా చిరంజీవి డిఎంకే ఎంపీలతో కూడా సమావేశమయ్యారు. త్వరలో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లనున్నందున వ్యూహాలపై వారితో చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసు, డిఎంకె పొత్తు ఉన్నందున కేవలం తెలుగు వారు ఉన్న ప్రాంతాలలోనే ప్రచారం చేయాలా లేదా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేయాలా అనే దానిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

English summary
PRP president Chiranjeevi met today Prime Minister Manmohan Singh at Parliament central hall and urged for Polavaram project clearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X