కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీపై పోలీస్ స్టేషన్‌లో టిఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
కరీంనగర్: శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై అందరినుండి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సందర్భంలో కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి అదే శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై ఏకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రవీందర్ సింగ్ అనే వ్యక్తి శుక్రవారం కరీంనగర్ పోలీసు స్టేషన్‌లో శ్రీకృష్ణ కమిటీ నివేదికపైన, 8వ అధ్యాయంపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కమిటీ సభ్యులపైన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిటీ నివేదిక తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా ఉందని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా ఇచ్చిన 8వ అధ్యాయంలో తెలంగాణ ప్రకటిస్తే నక్సలిజం పెరుగుతుందని, మత ఘర్షణలు హెచ్చుమీరుతాయని చెప్పినట్లుగా వార్తలు వచ్చినట్లు తెలిసిందే. మీడియా కూడా ఉద్యమాన్ని పెంచి పోషించే విధంగా ఉందని 8వ అధ్యాయంలో పేర్కొన్నది.

English summary
TRS leader Ravinder Singh put a case on Srikrishna Committee members in Karimnagar. He said in committee was blamed Telangana people with report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X