హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి తీరు సిగ్గు చేటు: ఎంపీ మధు యాష్కీ అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని అప్రకటితంగా అమలు చేస్తున్నట్లుగా ఉందనే అనుమానాన్ని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సోమవారం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల తరహాలో త్వరలో మంత్రులు ఢిల్లీ వెళ్లి తెలంగాణపై అధిష్టానాన్ని అడిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం అడిగినట్టుగా తాము ఏప్రిల్ 10 తేది వరకు తెలంగాణ ప్రకటనపై ఆగుతామన్నారు. అంతేకాదు మే 1వ తేది వరకు ఆగుతామని ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే రాజీనామాకు అయినా సిద్ధమని చెప్పారు.

వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై దాడి చేయడాన్ని యాష్కీ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సభ్యులంతా ఓ నిర్ణయానికి వచ్చి స్పీకరు దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. కానీ ఇలా దాడి చేయడం మాత్రం సిగ్గు చేటన్నారు. ప్రజలు ఎన్నుకొని సభకు పంపించింది భౌతిక దాడులు చేయడానికి కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

కాగా మాజీ మావోయిస్టు, తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివరావు హత్యను ఆయన ఖండించారు. ఈ హత్యలో పోలీసులు, ప్రభుత్వం హస్తం ఉంటే వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సాంబశివుడు హత్య నిందుతులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.

English summary
Nizamabad MP Madhu Yashki suspected that central government is following 8th chapter in AP. He condemned minister Vivekananda Reddy and YS Jagan camp MLAs attack on TDP MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X