హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో గాలిపై వైయస్ వివేకా, జగన్ వర్గం ఎమ్మెల్యేల దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: అసెంబ్లీలో సోమవారం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యులు దాడికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఎదురయింది. టిడిపి ఎమ్మెల్యే గాలి మద్దు కృష్ణమనాయుడు, చింతమనేని ప్రభాకర్‌పై వ్యనసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి చేయి చేసుకున్నట్లుగా తెలిస్తోంది. సభలో ప్రారంభమయ్యాక మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభాసంఘం వేయాలని టిడిపి పట్టుబట్టింది.

సభలో వైయస్ హయాంలో దొంగల ముఠా అని, వైయస్ భూపందేరాలు చేశారనే పలు ప్లకార్డులు పట్టుకొని టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ జెఎల్పీకి పట్టుబట్టారు. అయితే మంత్రి వివేకా, జగన్ వర్గం ఎమ్మెల్యేలు టిడిపి శాసనసభ్యుల వద్దకు చొచ్చుకు వెళ్లారు. టిడిపి ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ప్లకార్డులను వారు లాక్కున్నారు. దీంతీ ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు. అయితే సభను వాయిదా వేసిన అనంతరం ఇరువర్గాలు పరస్పర దూషణలకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఇంతవరకు మాటల యుద్ధం మాత్రమే జరిగింది. కానీ సోమవారం వివేకా టిడిపి ఎమ్మెల్యేలపై దాడి చేయడం శోచనీయం. అయితే మంత్రి అహ్మదుల్లా వారిని వారించే ప్రయత్నాలు చేశారు.

English summary
Minister YS Vivekananda Reddy attack on TDP MLAs Gali Muddukrishnama Naidu and Chinthamaneni Prabhakar today. Ex MP YS Jaganmohan Reddy camp MLAs also attack on TDP MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X