వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య: కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో కోసి హత్య

|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: ఓ ఇంటర్మీడియేట్ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన సంఘటన విశాఖపట్నంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇంటర్మీడియేట్ చదువుతున్న అశ్విని మృదుల అనే అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కత్తితో కోసి చంపారు. విశాఖలోని దొండపర్తి జంక్షన్‌లోని మెట్రో రెసిడెన్సీలోని ఈ హత్య చోటు చేసుకుంది. ఈ హత్య మధ్యాహ్నం 11 నుండి 12 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అశ్విని కాళ్లు, చేతులు కట్టేసి గొంతును కత్తితో కోశారు. ఉదయం తమ్ముడితో పాటు ఇంట్లోనే అశ్విని ఉంది. అయితే తమ్ముడు పాఠశాలకు వెళ్లిన తర్వాత ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.

అశ్విని అమ్మ న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె హైదరాబాదు వెళ్లారు. తండ్రి పెట్రోలు బంకు నిర్వహిస్తుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పెట్రోలు బంకులో పని చేసే వ్యక్తి దీనిని గమనించడంతో విషయం తెలిసింది. ఇంట్లోకి ఓ అంగతకుడు ప్రవేశించినట్లుగా చెబుతున్నారు. అయితే పెట్రోలు బంకు నిర్వాహకులు కాబట్టి ఇంట్లో డబ్బులు ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ఆ అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా దొంగల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అశ్విని తండ్రిపై దొంగలు రెండుసార్లు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అశ్విని మృతదేహం బాత్రూంలో రక్తం మడుగులో పడి ఉంది.

English summary
Intermediate student Ashwini Mrudula murdered in Vishakapatnam today. Ashwini's father petrol bunk owner, mother lawyer. Police suspecting for theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X