భూ కేటాయింపులపై సభా సంఘం, ఎట్టకేలకు అంగీకరించిన సిఎం

చివరకు శాసనసభలో భూ కేటాయింపులపై సోమవారం చర్చ చేపట్టి మంగళవారం ముగించింది. చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి.. జేఎల్సీపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో విపక్షాలు మరోసారి తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభాసంఘం వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఎట్టకేలకు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించి విచారణ పరిధిలోకి తీసుకురావాల్సిన భూ కేటాయింపులను ప్రభుత్వం త్వరలో నిర్ణయిస్తుంది. ఇందులో వక్ఫ్బోర్డు భూములు కేటాయించిన 23 సెజ్లు ఉంటాయని ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ జారీచేసిన నోటీసులతో ప్రభుత్వానికి ప్రాథమిక సాక్ష్యాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా... ''ఒక వ్యక్తి, సంస్థకు సంబంధించిన పెట్టుబడుల అంశాన్ని ఆదాయపన్నుశాఖ చూసుకుంటుంది. మీరు ఇచ్చిన పిటిషన్ అన్ని శాఖలకు పంపించాం. అక్కడ నుంచి సమాధానం వచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాం'' అని కిరణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications