జయలలితకే తమిళుల పట్టం, ప్రతిపక్షానికే కరుణ: సర్వేలో వెల్లడి
కరుణానిధి సారథ్యంలోని డిఎంకె ఈసారి అధికారాన్ని కోల్పోతుందని ఆ సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. డిఎంకెకు ఈ ఎన్నికల్లో 84 నుండి 88 సీట్ల వరకు దక్కవచ్చునని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఏ పార్టీ ఓటింగ్ శాతం ఆ పార్టీకి దాదాపుగా ఉంటుందని తెలుస్తోంది. జయకు 47 శాతం, కరుణానిధికి 46 శాతం ఓటింగ్ ఉంటుందని సర్వేలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఒక్క శాతం కారణంగానే డిఎంకె అధికారానికి ఈసారి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పొత్తులో భాగంగా అన్నాడిఎంకే 160 సీట్లలోనే పోటీ చేస్తుంది.
2జి స్పెక్ట్రం కుంభకోణం బయటపడిన తర్వాత డిఎంకెపై అక్కడి విద్యావంతులకు నమ్మకం పోయినట్లుగా తెలుస్తోంది. కేంద్రంలో భారీ కుంభకోణాలు బయట పడటం కారణంగా కాంగ్రెసుతో జత కట్టడం వలన ఆ మకిలి డిఎంకెకు కూడా అంటుకున్నది. అయితే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం 2జి స్పెక్ట్రంలో డైరెక్ట్గా డిఎంకె మంత్రి ఎ.రాజా ఉండటం, అరెస్టు కావడం తమిళ ఓటర్లకు డిఎంకెపై నమ్మకం పోవడానికి కారణంగా తెలుస్తోంది. 2జి దెబ్బ కారణంగానే కరుణానిధి తన నియోజకవర్గాన్ని మార్చినట్టుగా తెలుస్తోంది. 2జి కుంభకోణం డిఎంకెకు అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తుండగా, కూటమితో జత కట్టడం కూడా నష్టపరుస్తున్నట్లు సర్వేలో వెల్లడయిందంట.