హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆలోచిస్తా: కందుల రాజమోహన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అందుకే ఆ పార్టీని వీడుదామని నిర్ణయించుకున్నామని కడప జిల్లాకు చెందిన కందుల రాజమోహన్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఇది వరకే మాట్లాడామని, ఆయనకు స్వయంగా పార్టీని వీడుతున్నట్లుగా చెప్పామని అన్నారు. కాంగ్రెసులో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే టిడిపిని వీడటం మాత్రం ఖాయమన్నారు.

టిడిపిలో సరైన న్యాయం జరగనందునే తాము పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. అయితే పదవుల కోసం పార్టీని మారటం లేదన్నారు. పదవి లభించలేదని పార్టీని వీడుతున్నానడంలో వాస్తవం లేదన్నారు. పదవుల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. కాంగ్రెసు పార్టీలో కడప పార్లమెంటు అభ్యర్థిగా తన పేరు వినిపిస్తుందనే విషయం తనకు తెలియదన్నారు. ఒకవేళ కాంగ్రెసు పార్టీ అటువంటి ప్రతిపాదన తన ముందుకు తీసుకు వస్తే ఆలోచిస్తానని చెప్పారు.

English summary
Kadapa political leader Kandula Rajamohan Reddy said today that he will think if Congress give ticket. He said he was very disappointed with TDP attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X