హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో బిజెపి రాజకీయ శక్తిగా ఎదుగుతుంది: రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ముందు ముందు బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గం శాసనసభ్యుడు గంగాపురం కిషన్‌ రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో బిజెపికి త్వరలో మంచి రోజులు రానున్నాయని అన్నారు. 2014లో ఎన్డీయే జాతీయ రాజకీయాలను శాసిస్తుందని అన్నారు. పూర్తి అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెసు పార్టీని వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారని, బిజెపికి పట్టం గడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు అవినీతిని ప్రజలముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో జన సంఘర్ష్ ర్యాలీలు ఈ రోజునుండి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

English summary
BJP state president G.Kishan Reddy said today that Party will strengthen in AP soon. He participated in Party 32nd inauguration programme in party office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X