కడపలో గెలిచాక తెలంగాణపై వైయస్ జగన్ ప్రకటన చేస్తారు: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: కడప లోకసభ స్థానంలో గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యుడి హోదాలో తెలంగాణపై తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పారు. కడపలో కాంగ్రెసు పార్టీకి ఓటమి తప్పదని, ప్రభుత్వం ఆభాసు పాలవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం జగన్‌దేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరులో వైయస్ జగన్ విజయం సాధిస్తారని ఆయన అన్నారు.

జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఉండవల్లి వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శమని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉండవల్లి ఇంత దిగజారుతారని అనుకోలేదని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఉండవల్లి మానుకోవాలని ఆయన సూచించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్రపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విచారణ జరిపించుకోవచ్చునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+