కంప్యూటర్ కోసం యాభైవేలు తీసుకురాలేదని భార్యను ఉరేసి చంపిన సాప్ట్వేర్ ఇంజనీర్
పోస్ట్ మార్టం వివరాల ప్రకారం జయశ్రీ చనిపోయినటువంటి తీరు చూస్తుంటే ఇది హాత్యగా భావించారు. ఈ కేసు విషయమై పోలీసులు సుశాంత్ తల్లిదండ్రులుని కూడా అరెస్టు చేయడం జరిగింది. జయశ్రీని ఇంతలా వేధించడానికి కారణం వరకట్నమే ముఖ్యకారణమని ఆమె అన్నయ్య డాక్టర్ సంజయ్ సోనేకర్ వెల్లడించారు. ఇది ఖచ్చితంగా మర్డర్ నని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దానికి కారణం మా చెల్లి ఉరేసుకోని చనిపోయేటటువంటి పిరికిపంద కాదని అన్నారు. తను ఉరికి అంగీకరించికపోవడంతో తనని హింసించి మరీ ఉరి వేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది.
ఐతే జయశ్రీ తల్లిదండ్రులు మార్చి 23వ తారీఖునే సుశాంత్ని కలసి తన ల్యాప్ ట్యాప్ కోసం రూ 50,000 ఇవ్వడం జరిగిందన్నారు. ఇద్దరి కుటుంబాల మద్య ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మార్చి 26వ తారీఖున కూర్చోని మాట్లాడుకోవడం జరిగిందన్నారు. ఈ విషయంపై చర్చి జరుగుతున్న సమయంలో జయశ్రీని సుశాంత్ వాళ్శ చెల్లి తన తల్లిదండ్రుల ముందే గట్టిగా తోయడం జరిగింది. దాంతో ఏదో సర్ది చెప్పి తన కూతురుతో మాట్లాడి తల్లిదండ్రులు వెళ్శిపోయిన తర్వాత ఇలా తనని చంపేశారని జయశ్రీ తల్లి దండ్రులు వాపోయారు.