లొంగిపోతానని సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్ పోన్
అయితే బుధవారం స్వయంగా భానుకిరణ్ హైదరాబాద్ పోలీసులకు ఫోన్ చేసి తాను లొంగిపోతానని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. భాను తిరుపతి నుండి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించి వెనువెంటనే పోలీసుల బృందాన్ని తిరుపతికి పంపించింది. తాను రాయలసీమలో ఓ ప్రాంతంలో లొంగిపోతానని చెప్పినట్టు తెలిసింది. దీంతో పోలీసులు సీమ అంతటా పోలీసును అప్రమత్తం చేసి గాలిస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో భానుకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.
కాగా భానుకిరణ్ లొంగిపోతానని వచ్చిన కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని డిసిపి సత్యనారాయణ అంటున్నారు. మాకు ఎక్కడినుండి ఎవరి నుండి ఫోన్ రాలేదని చెప్పారు. భానును త్వరలో పట్టుకుంటామని చెప్పారు. భాను నుండి ఫోన్ వచ్చిందనేది కేవలం మీడియా కథనాలే అని చెప్పారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికే భాను కిరణ్ ఫోన్ చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.