ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యే కమలమ్మ, మళ్లీ వైయస్ జగన్ వైపు?

గత రెండు రోజులుగా ఆమె తన నియోజకవర్గంలో గానీ, తన స్వగ్రామం పోరుమామిళ్లలో గానీ లేరు. కడప జిల్లా కేంద్రంలో కూడా లేరు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కూడా ఆమె కనిపించలేదు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి కమలమ్మ స్వగ్రామం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తగిన ప్రాధాన్యం లభించేలా చూస్తామని, కమలమ్మకు నచ్చజెప్పాలని వారు సర్ది చెప్పారు. బద్వేలు నియోజకవర్గంలో తనకు కాకుండా గోవింద రెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇవ్వడంపైనే ఆమె అభ్యంతరమని చెబుతున్నారు. ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హామీ ఇవ్వడంతో ఆమె వైయస్ జగన్తో భేటీ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications