పాక్ ప్రధాని పరువు తీసిన ట్రంప్.. అంత మాట అనేశాడేంటి..??
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సోమవారం పలు ముస్లిం-మెజారిటీ దేశాలను 'అబ్రహం ఒప్పందం' లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ తో కూడిన విస్తృత శాంతి ఒప్పందాన్ని సుస్థిరం చేయడమే ఆయన లక్ష్యం. అయితే, తాను మాట్లాడిన నాయకుల జాబితాను ప్రకటిస్తూ.. ట్రంప్ తన పోస్ట్ లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు బదులుగా ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ను పేర్కొన్నారు.\
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్లో సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు తన మొదటి పదవీకాలంలో కుదిరిన అబ్రహం ఒప్పందాల కింద ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను వారాంతంలో అనేక ప్రాంతీయ నాయకులతో చర్చించినట్లు ఆయన స్వయంగా తెలిపారు.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్లను వారి అధికారిక హోదాలతోనే ట్రంప్ సంబోధించారు. అయితే, పాకిస్తాన్ ప్రతినిధిని "ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా" గా గుర్తించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ను విస్మరించడం ఆసక్తికరం.
ఎన్నికైన పదవిలేని మునీర్ను పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. అక్కడి రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం సుదీర్ఘకాలంగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ట్రంప్ గతంలో మునీర్ను "చాలా గొప్ప వ్యక్తి" గా బహిరంగంగా ప్రశంసించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వైదొలిగిన తర్వాత, వాషింగ్టన్తో సంబంధాలను పునరుద్ధరించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న సమయంలో, మునీర్ ట్రంప్కు, ఆయన సన్నిహితులకు చేరువయ్యారని విశ్లేషకులు అంటున్నారు.

మునీర్ ఇరాన్కు సంబంధించిన సీక్రెట్ దౌత్యంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాకిస్తాన్ ఇరాన్తో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటుంది. ఈ ప్రాంతంలో సుదీర్ఘ సంఘర్షణ మతపరమైన అశాంతి, ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడిని దేశంలో పెంచుతుందని ఇస్లామాబాద్ భయపడుతోంది. పాకిస్తాన్ను అబ్రహం ఒప్పందాలలో చేర్చాలన్న ట్రంప్ ఒత్తిడి తీవ్ర వివాదాస్పదం కావచ్చు. ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించరాదని ఇస్లామాబాద్ సంప్రదాయబద్ధంగా నిర్ణయించుకుంది. సంబంధాల సాధారణీకరణకు దేశీయంగా బలమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications