Indian Railways బిగ్ మాస్టర్ ప్లాన్.. 20,000 స్టేషన్లలో 'ట్యాంక్ టు ట్యాప్' ప్యూరిఫికేషన్!

స్వతంత్ర భారతంలో సామాన్యుడికి కనీసం స్వచ్ఛమైన తాగు నీరు కూడా దొరకడం లేదు. బయటకు వెళ్తే తాగే నీరు ఎంత కలుషితమై ఉంటుందో మనం ఊహించలేం. మినరల్ వాటర్ అనుకుని కొనుక్కొని తాగే నీరు కూడా ఒరిజినల్ కాకపోవడం మన దౌర్భాగం. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రైల్వే స్టేషన్లలో తాగు నీటి గురించి దిమ్మతిరిగే వార్త బయటకు వచ్చింది. రోజువారీ ప్రయాణాల్లో లక్షలాది మంది ప్రజలకు దిక్కయిన భారతీయ రైల్వే వ్యవస్థలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తాగే నీటిలో ప్రమాదకరమైన 'ఈ-కోలై' (E. coli) బ్యాక్టీరియా ఉందని కాగ్ నివేదిక బాంబు పేల్చింది. హైదరాబాద్, కొయంబత్తూరు, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వంటి దిగ్గజ స్టేషన్లతో సహా పలు చోట్ల తాగే నీటి నాణ్యత అధ్వానంగా ఉందని హెచ్చరించింది. ఈ నివేదికతో తక్షణమే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని అందించేందుకు 'ట్యాంక్ టు ట్యాప్' అనే బృహత్తర ప్రాజెక్టును అత్యవసరంగా రంగంలోకి దించారు.

CAG Audit Reveals E Coli in Railway Station Water Ministry Launches Massive Tank to Tap Water Action Plan

20,000 కేంద్రాల్లో నయా ఫిల్ట్రేషన్ ప్రాసెస్!

కాగ్ హెచ్చరికల నేపధ్యంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన రైల్వే మంత్రి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లోని వాటర్ కూలర్లు , ప్రధాన నీటి కేంద్రాలతో కలిపి దాదాపు 20,000 ప్రాంతాల్లో అత్యంత ఆధునిక "ట్యాంక్ టు ట్యాప్" ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాతబడిపోయిన నీటి ట్యాంకులను వెంటనే తొలగించి, సోర్స్ నుంచి ప్రయాణికులు ట్యాప్ వరకు ప్రతి దశలోనూ వాటర్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించనున్నారు.

 రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!
రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!

కేంద్రీకృత నిఘా.. బోర్డు లెవెల్లో రోజువారీ మానిటరింగ్!

ఈ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రైల్వే బోర్డు గుర్తించింది. కేవలం ఫిల్టర్లు పెట్టడమే కాకుండా, రైల్వే బోర్డు స్థాయిలోనే నేరుగా ఆన్‌లైన్ నిఘా వ్యవస్థ ద్వారా ప్రతీ స్టేషన్‌లోని నీటి స్వచ్ఛత నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తారు. పారదర్శకత కోసం నీటి నాణ్యత నివేదికలను ఎప్పటికప్పుడు బహిరంగంగా విడుదల చేయనున్నారు. నీటి ట్యాంకుల సమయానుకూల శుభ్రత, క్లోరినేషన్ ప్రాసెస్ పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేశారు.

Video: ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లు.. బావిలో వింత ఘటన
Video: ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లు.. బావిలో వింత ఘటన

కాగ్ నివేదికలో షాకింగ్ నిజాలు.. కఠిన చర్యలకు నిర్ణయం!

ఈ-కోలై బ్యాక్టీరియా కలిషిత నీటిని తాగడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, డయేరియా , కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కాగ్ జరిపిన సమగ్ర తనిఖీల్లో సుమారు 89 శాతానికి పైగా స్టేషన్లలో కనీస ప్రాథమిక సదుపాయాలు లోపించాయని తేలింది. ముఖ్యంగా తాగునీటి కుళాయిలు, శౌచాలయాల పరిశుభ్రత అత్యంత ఘోరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ లోపాలన్నింటినీ సరిదిద్ది, ప్రయాణికుల నమ్మకాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఇప్పుడు అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+