వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం, ఓటేసిన జయలలిత, విజయకాంత్
ఎల్డీఎఫ్, యూడీఎఫ్లు ప్రధానంగా పోటీ పడుతున్న మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ 971 మంది బరిలో ఉన్నారు. వారిలో అత్యధికులు ఇండిపెండెంట్లే. మొత్తం ఓటర్ల సంఖ్య 2.31 కోట్లు ఉండగా 2118 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు గానూ 187 మంది పోటీలో ఉన్నారు. అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8.1 లక్షలు. 867 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ 17, డీఎంకే 10, ఆల్ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 17, ఏఐఏడీఎంకే 10 స్థానాల్లో బరిలో ఉన్నాయి. పోటీలో ఉన్న ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైతిలింగం, ఆయన మంత్రివర్గ సహచరులు, అసెంబ్లీ స్పీకర్ ఆర్ రాధాకృష్ణన్, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి తదితరులున్నారు.
Comments
English summary
Polling in Tamil Nadu, Kerala and Puducherry began on Wednesday amid unprecedented security to elect their new assemblies in one of the closest battles that witnessed a bitter race between rival fronts.
Story first published: Wednesday, April 13, 2011, 9:57 [IST]