కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమలమ్మ సీరియల్: చర్చలు విఫలం, జగన్‌కు మళ్లీ ఝలక్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: కడప జిల్లా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ వ్యవహారం సీరియల్ కథలా సాగుతోంది. కాంగ్రెసు వైపు వెళ్లి మళ్లీ జగన్ వైపు మళ్లిన కమలమ్మ మరోసారి వైఖరి మార్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌కు ఝలక్ ఇవ్వడానికి మరోసారి సిద్ధపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బుధవారం కమలమ్మతో విస్తృతంగా చర్చించారు. ఆ తర్వాత వైయస్ జగన్‌ను కలిశారు. బుధవారం రాత్రి జగన్‌తో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆమె కాంగ్రెసు వైపు రావడానికి మరోసారి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

బద్వేలు నియోజకవర్గంలో గోవిందరెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తూ తనను ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారని కమలమ్మ జగన్‌కు ఫిర్యాదు చేశారని, జగన్ ఆమె మాటలు వినడానికి కూడా ఇష్టపడలేదని, గోవింద రెడ్డితో కలిసి పనిచేయాలని సూచించారని, దీంతో కమలమ్మ మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. జగన్ తన మాటలు వినిపించుకోకపోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగడం మంచిది కాదని ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తనకు వైయస్సార్ కాంగ్రెసు నుంచి టికెట్ దొరకడం కూడా కష్టమని, అంతా గోవింద రెడ్డే అవుతారని ఆమె భావించి తిరిగి కాంగ్రెసులోకి రావడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆమెను కాంగ్రెసులోకి తీసుకురావడానికి శివరామకృష్ణయ్య చర్చలు జరిపినట్లు సమాచారం.

English summary
Badvel MLA Kamalamma has decided to continue in Congress. Kamalamma's talks with YS Jagan failed. So, she decided to part away from YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X