కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే కమలమ్మ, క్షోభ పెడుతున్నారని ఆవేదన

Congress
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో కడప జిల్లా బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ గురువారం మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు విలువలేని చోట ఉండలేనని చెప్పారు. తాను కాంగ్రెసులో కొనసాగుతానని ఆమె అధికారికంగా ప్రకటించారు. తనకు ప్రాధాన్యం ఉన్న కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత తనను మానసిక క్షోభకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్సార్ కాంగ్రెసులో తనకు విలువ లేదని, అందుకే ఆ పార్టీలో చేరడానికి తాను ఇష్టపడడం లేదని ఆమె చెప్పారు. వైయస్ జగన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ఆమె నియోజకవర్గం కార్యకర్తలతో మాట్లాడారు. ప్రాధాన్యం ఉన్న కాంగ్రెసులోనే కొనసాగాలని కార్యకర్తలు సూచించినట్లు ఆమె తెలిపారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కమలమ్మతో గురువారంనాడు కూడా చర్చలు జరిపారు. కానీ ఆమె వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి ఇష్టపడలేదు. కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని కమలమ్మ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+