విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పీచ్ అడ్డుకున్న జగన్ వర్గం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్పీచ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు జగన్‌ను అనుకూలంగా నినాదాలు చేశారు. జగన్‌కు మద్దతు పలకాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా జుజ్జువరం గ్రామంలో చోటు చేసుకుంది. గొడవ సద్దుమణిగిన అనంతరం ఆయన తన స్పీచ్ కొనసాగించారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంతగా ప్రాధాన్యం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీల బలం ఈ ఎన్నికలలో తెలియవని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే ఆయా పార్టీల బలం తెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు పార్టీని వీడిన వారు 2014లో తప్పకుండా కాంగ్రెసు పార్టీలోకి వస్తారని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy followers obstructed Vijayawada MP Lagadapati Rajagopal's speech today in Krishna district. They gave slogans supporting YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X