వైయస్ జగన్‌తో కలిసి బిజెపి రాష్ట్రంలో కుట్ర చేస్తోంది: డి. శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి బిజెపి రాష్ట్రంలో కుట్ర చేస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విమర్శించారు. జగన్‌ను ముందు పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బిజెపి ప్రయత్నాలు సాగిస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి బిజెపి వైయస్ జగన్‌ను వాడుకుంటోందని ఆయన అన్నారు. బిజెపి జగన్‌తో కలిసి రాజకీయం చేస్తే కుట్ర ఎలా అవుతుందని అడిగితే కాంగ్రెసుకు రాజీనామా చేసిన వైయస్ జగన్‌ను తమ పార్టీలో చేర్చుకోకుండా, లోపాయికారిగా కలిసి పనిచేయడం కుట్రే అవుతుందని ఆయన సమాధానమిచ్చారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికల వెనక జగన్‌తో కలిసి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై జగన్ విమర్శలు చేయడం వెనక బిజెపి ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కేంద్రంలో ఏ పార్టీకి మద్దతిస్తారని ఆయన అడిగారు. జగన్ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎతో ఉంటారా, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెతో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్న తృతీయ ఫ్రంట్‌లో ఉంటారా అని ఆయన అడిగారు.

సందర్భం వచ్చినప్పుడు బిజెపికి, వైయస్ జగన్‌కు మధ్య గల సంబంధాలను బయటపెడతానని ఆయన చెప్పారు. వైయస్ జగన్ అక్రమాస్తులపై ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులు తాము కాంగ్రెసు శాసనసభ్యులమని చెప్పుకునే ఆర్హతను కోల్పోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ గెలిస్తే బిజెపి మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+