తిట్టిన చిరంజీవిని చేర్చుకున్నప్పుడే కాంగ్రెసు...: కొండా సురేఖ
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. తాము గోడ మీది పిల్లులాంటివాళ్లం కాదని, తాము వైయస్ కుటుంబంతోనే ఉంటామని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో పొటా కేసు పెట్టినప్పుడే తాము భయపడలేదని, ఇప్పుడు భయపడే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. తెలంగాణకు వ్యతిరేకమని వైయస్ జగన్ ఇప్పటి వరకు చెప్పలేదని, అందువల్ల జగన్ తెలంగాణకు వ్యతిరేకి అనడం సరి కాదని ఆమె అన్నారు.
తన భర్త కొండా మురళికి భద్రత కుదింపుపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్నవారిని మానసికంగా హింసించడంలో భాగంగానే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందని ఆమె విమర్సించారు. తమ వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు భారీ భద్రత కల్పించిన ప్రభుత్వం తమకు మాత్రం భద్రత కుదిస్తోందని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళి ప్రాణాలకు ముప్పు ఉందని, తన భర్తకు ఏమైనా జరిగితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ప్రభుత్వం వరకు బాధ్యులని ఆమె అన్నారు.