కమలమ్మ తిరిగి రావడం వెనుక యువనేత: సిఎం కిరణ్తో జగన్ గేమ్?

అయితే తన వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడకుండా ఉండటానికి జగన్ కూడా ప్రయత్నాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్లాన్లో భాగంగానే ఆయన తన వర్గం ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెసులోనే ఉన్నట్లు ప్రకటన చేయమని చెప్పినట్లుగా తెలుస్తోంది. వారు తన వెంట ఉంటున్నారంటే పార్టీ వేటు వేయడం ఖాయం. కాబట్టి ప్రస్తుతానికి షోకాజు నోటీసులు అందుకోకుండా ఉండటం, వేటు పడకుండా ఉండటం కోసం కాంగ్రెసు వెంటే ఉంటామనే సంకేతాలు పంపి గట్టెక్కాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కడప ఉప ఎన్నికలు అయిపోయాక మెజార్టీ తగ్గినా పెరిగినా ఎలాగూ తాను తన తల్లి గెలుస్తుంది. ఆ తర్వాత తన వద్దకు చాలా మంది వస్తారు కాబట్టి ఆ తర్వాత చర్యలు తీసుకున్నా ఫరవాలేదనే భావనలో జగన్ వర్గం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అందులో భాగంగానే బద్వేలు శాసనసభ్యురాలు కమలమ్మ మొదటగా జగన్ను వీడి కాంగ్రెసు వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే కమలమ్మ విషయంలో జగన్నాటం ఉన్నా లేకున్నా శ్రీనివాసులు తదితర ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరతామని చెప్పడం వెనుక మాత్రం జగన్ హస్తం ఉన్నట్లుగా పలువురు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారు. జగన్ ఎమ్మెల్యేల విషయాన్ని పలువురు కాంగ్రెసు నేతలు కూడా ముందుగానే గమనించినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే శ్రీనివాసులు వంటి వారు తిరిగి కాంగ్రెసులోకి వస్తామని చెప్పడంపై విశ్వాసం లేనట్లుగా తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications