కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలలో వైయస్ జగన్, విజయమ్మలకు ఒకే గుర్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన తల్లి విజయమ్మకు కడప ఉప ఎన్నికలలో ఒకే గుర్తు వచ్చింది. ఇద్దరికి ఎన్నికల సంఘం అధికారులు సీలింగ్ ఫ్యాన్‌ను కేటాయించారు. కడప పార్లమెంటు నుండి జగన్, పులివెందుల నుండి విజయమ్మ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి ప్రాధాన్యతగా సీలింగ్ ఫ్యాన్ కోరారు. ఎన్నికల అధికారులు కూడా దానినే వారిద్దరికి కేటాయించారు.

కాగా గురువారంతో ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ తేది ఆఖరు కావడంతో కడప ఎంపీ ఆభ్యర్థులుగా వేసిన వారిలో మరొకరు ఉప సంహరించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరుతో కడప బరిలో పది మంది ఉన్నారు. జగన్, విజయమ్మలకు ఒకే గుర్తు రావడంతో ఇక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వారు ఆ గుర్తుతో ముమ్మరంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక విస్తృతంగా ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

English summary
EC allotted same symbol to Ex MP YS Jagan and his mother Vijayamma in Kadapa and Pulivendula by-pole. YSR Congress party is thinking to take symbol in to voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X