కాంగ్రెసు, వైయస్ జగన్ వర్గం మధ్య రాజీనామాల సవాళ్లు
తమ కాంగ్రెసు తరఫున గెలిచి వైయస్సార్ కాంగ్రెసులో తిరుగుతున్న శాసనసభ్యులు రాజీనామా చేయాలని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలో తిరగడం నైతిక కాదని ఆయన అన్నారు. వైయస్సార్ పథకాలను తాము నిలిపేయలేదని, అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. వరుస ఉప ఎన్నికల వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ను కాంగ్రెసు నుంచి వేరు చేసి చూడలేమని మరో మంత్రి శైలజానాథ్ అన్నారు. కడప ఉప ఎన్నికలో కాంగ్రెసుకు మెజారిటీ లభిస్తుందని ఆయన అన్నారు.
Comments
English summary
As campaigning for Kadapa and Pulivendula bypolls picking up, Congress and YSR Congress leaders are criticising each other.
Story first published: Tuesday, April 26, 2011, 10:02 [IST]