హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌తో మాకు సంబంధం లేదు: బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

G Kishan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌తో తమ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ స్పష్టీకరణ చేశారు. అంతర్గత కుమ్ములాటలను తమపై రుద్దవద్దని, ఒకటి వైయస్సార్ కాంగ్రెసు అయితే మరోటి సోనియా కాంగ్రెసు అని, రెండు కూడా కాంగ్రెసు పార్టీలేనని, వాటితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలో ఒంటరిగానే ఎదగాలని అనుకుంటున్నామని, మరో పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

తమ పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి కడప ఉపఎన్నికల్లో లబ్ధిపొందాలని కొన్ని పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయని ఆ కిషన్‌రెడ్డి విమర్శించారు. కడపలో తమకు తగిన బలం లేకపోవడంతోనే ఎన్నికలకు దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. అంతమాత్రాన తమ పార్టీని కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లీం, మైనార్టీలంతా తమవైపే ఉన్నారని ప్రేమ ఒలకపోసే కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో డీఎస్‌ ఎందుకు ఘోరంగా ఓటమి పాలయ్యారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో తమ పార్టీని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెదేపా వాస్తవాలను మరచి విమర్శలకు దిగడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.కడప ఎన్నికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను అరికట్టి, ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించాలని ఆయన కోరారు.

English summary
BJP president G Kishan Reddy clarified that his party has no links with YSR Congress party leader YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X