నిలకడగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోగ్యం: సబితా ఇంద్రా రెడ్డి వెల్లడి

అక్బరుద్దీన్కు అందిస్తున్న చికిత్సను ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అక్బరుద్దీన్పై దాడి కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఇందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆమె చెప్పారు. అక్బరుద్దీన్ కాలేయం, గుండె, ఊపిరితిత్తులకు ఏ విధమైన ప్రమాదం లేదని ఆమె చెప్పారు.
కాగా, మలక్పేట శాసనసభ్యుడు బలాలా గన్మెన్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారని, వీరిలో ఒక వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని డిజిపి అరవింద రావు చెప్పారు. అయితే, ముగ్గురు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications