హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అభిమానులకు మీడియా ద్వారా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సందేశం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఐదు రోజుల క్రితం ప్రత్యర్థుల దాడిలో తృటిలో ప్రాణాప్రాయం నుండి తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ త్వరలో మీడియా ద్వారా తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడించేందుకు సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. అక్బరుద్దీన్ ఆరోగ్యంపై ఎంఐఎం కార్యకర్తలకు తీవ్ర అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం, కేర్ వైద్యులు అక్బరుద్దీన్ చే మీడియా ద్వారా మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా అక్బరుద్దీన్ ఆరోగ్యంపై బుధవారం కేర్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఆక్బర్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కిడ్నీల డయాలసిస్ నిలిపి వేసినట్లు చెప్పారు. అవయవాలన్నీ స్వతంత్రంగా పని చేస్తున్నాయని చెప్పారు. మెడికల్ పరికరాల అవసరం లేదన్నారు. వెంటిలేషన్ కూడా తొలగించినట్లు చెప్పారు. అయితే సెలైన్ల ద్వారా న్యూట్రిన్లు మాత్రం అందిస్తున్నట్లు చెప్పారు. తొడలో బుల్లెట్ తీయలేదని, బిపి కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిని తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.

English summary
Care doctors released health bulletin on MIM MLA Akbaruddin Owaisi health today morning. They said Akbaruddin health is stable. They said they stopped dialosis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X