వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కార్పియోను ఢీకొన్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్: 6గురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Trains Accident
నల్గొండ: జిల్లాలోని దామరచర్ల మండలం కుండ్రకోలు రైల్వే క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లవాగు తండానుండి బయలుదేరిన స్కార్పియోను కుండ్రకోలు రైల్వే క్రాసింగ్ వద్ద అటుగా వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు.

అయితే రైల్వే క్రాసింగ్ వద్ద రైల్వే గేటు లేక పోవడమే ఈ ప్రమాదానికి కారణం. కుండ్రకోలు వద్ద రైల్వే అధికారులు రైల్వే గేటును పెట్టక పోవడాన్ని స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు స్పందించి గేటు పెట్టక పోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు. అయితే మరణించిన వారు మొత్తం బంధువర్గమని భావిస్తున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న స్కార్పియో నంబర్ ఎపి 07 టివి 0226.

English summary
Janmabhoomi Express collided with Scorpio in Nalgonda district. Six dead and nine injured in this accident. Police were suspected that all the victims are belongs to Rallavagu Thanda village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X