వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుటుంబ కలహాల కారణంగా నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: కుటుంబ కలహాల కారణంగా ఓ భర్త కత్తితో తన భార్య గొంతును నడిరోడ్డుపై కోసిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెంకు చెందిన గోవిందు అనే వ్యక్తి తన భార్య కల్యాణి గొంతును కత్తితో కోశాడు. కల్యాని మూడేళ్ల తమ కూతురును పరీక్ష రాయించడానికి పాఠశాలకు తీసుకు వెళుతున్న సమయంలో భర్త వచ్చి కత్తితో కల్యాణి గొంతు కోశాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగడంతో స్థానికిలు ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లారు.

అయితే కత్తితో భార్య గొంతు కోసిన గోవింద్‌ను వెంటనే పోలీసులు స్థానికుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరికి నాలుగున్నరేళ్ల క్రితం పెళ్లయింది. అయితే తరుచూ వీరి మధ్య గొడవలు జరుగుతాయని చెబుతున్నారు. గోవిందు మద్యం తాగి వచ్చి కల్యాణిని నిత్యం వేధిస్తుంటారని చెబుతున్నారు. అయితే భర్త గొడవలు భరించలేక కల్యాణి స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. ఆ కేసును విత్ డ్రా చేసుకొమని భర్త వేధించాడని తెలుస్తోంది. అది కాస్త ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.

English summary
A Husband cutted his wife Kalyani's throat today in Vishakapatnam. She sented to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X