కడపలో వైయస్ జగన్‌కు మెజారిటీ అంతంతనే: ఆనం వివేకానంద రెడ్డి

Anam Vivekananda Reddy
హైదరాబాద్: కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌కు నాలుగు లక్షల మెజారిటీ వస్తుందనే మాటల్లో నిజం లేదని, జగన్‌కు 70 వేల దాకా మెజారిటీ వస్తుందని కాంగ్రెసు శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. జగన్‌కు మెజారిటీ వస్తే శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్తారనేది అపోహ మాత్రమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులు ఒక్కొక్కరే వెనక్కి వస్తున్నారని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ఎవరికీ లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు ఎవరూ కొత్తగా వెళ్లరని ఆయన అన్నారు. పులివెందుల శాసనసభ స్థానంలో తమ పార్టీ అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డే గెలుస్తారని, వైయస్ వివేకానందపై ప్రజల సానుభూతి ఉందని ఆయన చెప్పారు. కడపలో వైయస్ జగన్‌కు లక్ష మెజారిటీ వస్తే ఎక్కువని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+