కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను కొట్టి చంపిన భర్త, మళ్లీ అడపిల్లేననే కోపంతో కిరాతకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలులోని శంకరమఠంలో దారుణం చోటు చేసుకుంది. కడుపున మోస్తున్నది ఆడపిల్ల అని తెలిసి సాక్షాత్తూ కట్టుకున్న భర్తే నిండు గర్భిణిని చావచితక గొట్టాడు. కర్నూలులోని శంకరమఠం ప్రాంతంలో నివసించే ప్రకాశాచారి అనే వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. మూడోసారి గర్భం ధరించిన అతని భార్య సురేఖకు ఆరో నెల. స్కానింగ్‌ చేయిస్తే కడుపులో ఉన్నదీ ఆడపిల్లేనని తెలిసింది. దాంతో ఆమెను విపరీతంగా కొట్టి పరారయ్యాడు.

గాయాలతో సొమ్మసిల్లి ఉన్న సురేఖను పొరుగువారు ఆస్పత్రికి తరలించగా ఆమె మృతిచెందినట్లు తెలిసింది. పరారీలో ఉన్న నిందితుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. తొలికాన్పు నుంచీ కూడా అతను ఆడపిల్లను కన్న కారణంగా భార్యను హింసిస్తూనే ఉండేవాడని తెలుస్తోంది. ఆరేళ్లుగా తమ కూతురును ప్రకాశాచారి వేధిస్తున్నాడని, ఆడపిల్లలను కంటున్నావంటూ వేధించేవడాని సురేఖ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

English summary
Husband killed his wife in Shankar mutt of Kurnool. Surekha and Prakashachary married six years back. They have 2 girl children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X