హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ ఏజెంటుగా భన్వర్‌లాల్ వ్యవహరించారు: వీరశివా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌పై కాంగ్రెసు కడప జిల్లా కమలాపురం శాసనసభ్యుడు వీరశివా రెడ్డి విరుచుకుపడ్డారు. కడప ఉప ఎన్నికల్లో భన్వర్‌లాల్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏజెంటుగా వ్యవహరించారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కడప జిల్లా ఎస్పీ, కలెక్టర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తొత్తులుగా పని చేశారని ఆయన ఆరోపించారు. తాను ఇచ్చిన ఫిర్యాదును భన్వర్‌లాల్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.

తాను వైయస్ జగన్‌కు చెందిన డబ్బులపై ఇచ్చిన ఫిర్యాదును భన్వర్ లాల్ చాలా ఆలస్యంగా ఎస్పీ, కలెక్టర్‌లకు ఆలస్యంగా పంపారని, దీంతో జగన్ డబ్బులను తరలించడానికి వీలు కల్పించారని ఆయన అన్నారు. భన్వర్ లాల్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన అన్నారు. పోలింగ్ రోజు ఎస్పీ తనను అరెస్టు చేయడానికి ప్రయత్నించాడని ఆయన అన్నారు. ఆ విషయంపై తాను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

English summary
Congress Kadapa district Kamalapur MLA Veerasiva Reddy lashed out at Chief electoral officer Bhanwarlal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X