సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉంది: వైయస్ జగన్

కడప ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెసు అఖండ విజయం రాష్ట్రంలో రాజకీయ మార్పులకు నాంది కానుందని జగన్ చెప్పారు. కడప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెసు గెలుపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు సేవ చేయాలన్న జ్ఞానోదయం కలుగుతుందన్నారు. కడప ఓటర్లు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పారని, కాంగ్రెసుతో జతకట్టిన తెలుగుదేశం పార్టీని తరిమికొట్టారని దుయ్యబట్టారు. తన తండ్రి వైయస్పై అభిమానంతో తనకు, తన తల్లికి పట్టం కట్టిన ఓటర్లందరికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెసును ఆదరించడం ద్వారా వైయస్ తమ గుండెల్లో కొలువై ఉన్నారని ప్రజలు నిరూపించారన్నారు.
వరి మద్దతు ధర కోసం గుంటూరులో 48 గంటలపాటు తాను చేపట్టే దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జులై 8న కడపజిల్లా ఇడుపులపాయలో రెండు రోజులపాటు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు జగన్ వెల్లడించారు. ప్లీనరీలో విస్తృతంగా చర్చించి పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో తమకు ఘనవిజయాన్ని అందజేసిన కడప ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్, విజయమ్మ.. హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెసు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications