చర్యలు తీసుకుంటే ఊరుకోం: అధినేత చంద్రబాబుపై హరీశ్వర్ రెడ్డి ధ్వజం
ప్రణబ్కు లేఖ ఇచ్చిన మాదిరిగానే చిదంబరానికి కూడా చంద్రబాబు లేఖ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ఢిల్లీ పర్యటనలో చిదంబరం లేఖ ఇచ్చిన సమయంలో పార్టీ తరఫునా ఫోరం తరఫునా అని ప్రశ్నించారని అన్నారు. చిదంబరానికి బాబు లేఖ రాస్తేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారన్నారు. చంద్రబాబు కూడా అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పార్లమెంటులో కూడా ఎంపీలు ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకే తాము తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై టిడిపి ఒక్కసారి స్పష్టత ఇస్తే ప్రజలు నమ్ముతారన్నారు. ఇటీవల పెట్టిన ఫోరం తెలంగాణ సాధన కోసమా లేక తమపై చర్యలు తీసుకోవడానికా అని ప్రశ్నించారు.
టిడిపి తెలంగాణ ఇచ్చేది కాదు, తెచ్చేది కాదన్నారు. కాబట్టి ఒక్కసారి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే చాలన్నారు. తమ ముందు పార్టీలోకి వచ్చిన వారు కొందరు తమపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినందువల్లే తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇటీవల ఏర్పడిన ఫోరానికి తమపై చర్యలు తీసుకునే అర్హత లేదన్నారు. తమపై చర్యలు తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. పార్టీ మనుగడకు ఇబ్బంది లేకుండా తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఆయనపై ఫోరంపై సంధించిన ప్రశ్నలు... చంద్రబాబు చెబుతున్న రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారనా అని ప్రశ్నించారు. పోరం ఏర్పాటు సీమాంధ్ర నాయకుల రక్షించి తెలంగాణ వాదుల్ని కట్టడి చేయడానికా అని అన్నారు. విగ్రహాలు పునప్రతిష్టించాలనే టిడిపి డిమాండ్కు తెలంగాణ ప్రజల మద్దతు ఉందా అని ప్రశ్నించారు. టిడిపి ఎస్సార్సీకి ఒప్పుకుంటే ఫోరం వైఖరి ఎలా ఉంటుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో గట్టి పట్టు ఉన్న పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రజాగ్రహానికి గురైందా లేదా అని ప్రశ్నించారు. చిదంబరానికి లేఖ రాయాల్సిన అవసరం లేదని అనడంలో ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.