పిస్టోల్ చూపిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి ఇంటిపై రాళ్ల దాడి

Revanth Reddy
హైదరాబాద్‌: తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసిన తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు బుధవారం తలపెట్టిన కరీంనగర్ రణభేరీ బహిరంగ సభ కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు ఈ సభను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కరీంనగర్ రణభేరీకి బయలుదేరుతూ తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధుల వద్ద పిస్టోల్‌ను ప్రదర్శించారు.

కాగా, తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిపై వరంగల్‌లో రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడికి పాల్పడినవారు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలని భావిస్తున్నారు. కరీంనగర్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులను పెద్ద యెత్తున మోహరించారు. తెరాస కార్యకర్తలతో పాటు తెలంగాణవాదులను పోలీసులు పెద్ద యెత్తున అరెస్టు చేశారు. తెలుగుదేశం తెలంగాణ నాయకుల వాహనాలను హైదరాబాదులోని నాంపల్లి వద్ద అడ్డుకోవడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+