మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యేల కాన్వాయ్‌ని అడ్డుకున్న తరాస కార్యకర్తలు, నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak District
మెదక్‌: కరీంగనగర్ తెలంగాణ రణభేరీ బహిరంగ సభకు బయలుదేరిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుల కాన్వాయ్‌ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా చిన్న కోడూరు మండలం ఇబ్రహీం నగర్ వద్ద ఈ సంఘటన జరిగింది. టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లకుండా తెరాస నాయకులు, కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. రోడ్డుపై తెరాస జెండాలు పెట్టారు. రైఫిల్‌తో హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు వద్ద హల్ చల్ చేసిన శానససభ్యుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెరాస నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత తెలుగుదేశం శాసనసభ్యులను పంపించారు. కాగా, కరీంనగర్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సభను అడ్డుకోవడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. తెరాస నాయకులు నారదాసు లక్ష్మణ రావు, కొప్పుల ఈశ్వర్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌లో తెలుగుదేశం తెలంగాణ రణభేరీ బహిరంగ సభ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.

English summary
TRS workers obstructed TDP Telangana MLAs convoy at Ibrahim Nagar of Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X