హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెళ్లిపోవడం కాంగ్రెసుకు నష్టమే, అయితే తాత్కాలికమే: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు నుంచి వెళ్లిపోవడం నష్టమేనని, అయితే అది తాత్కాలికమేనని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా పిసిసి కార్యాలయం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి బాగా లేదని, నాయకుల మధ్య సమన్వయం లేదని ఆయన మాటల్లో వ్యక్తమైంది. రాష్ట్ర పరిస్థితిపై తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన పరిస్థితిలో మార్పు రాదని ఆయన అన్నారు.

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని, రెండు స్థానాల ఎన్నికలే కదా అని వదిలేయడం సరి కాదని ఆయన అన్నారు. మేధోమథనం జరగాల్సిన అవసరం ఉందని, నాయకులు మనసు విప్పి మాట్లాడుకోవాలని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు అవసమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతోనే వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలిచారని ఆయన అన్నారు.

English summary
Former CM Rosaiah said that YS Jagan exit from Congress is a loss, bit it is not permanent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X