వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ గెలుస్తారని చంద్రబాబు భయపడుతున్నారు: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: మధ్యంతర ఎన్నికల వస్తే వైయస్ జగన్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన విమర్శించారు. అవిశ్వాసం పెట్టాలని తాము అడిగితే మీరే పెట్టండని చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడిగా ధర్మం కాదని ఆయన అన్నారు.

తమకు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని, సాంకేతికంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం తమకు సాధ్యం కాదని, అందుకే ప్రధాన ప్రతిపక్షాన్ని అడుగుతున్నామని ఆయన అన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఆ కుట్రలో చంద్రబాబు పాలు పంచుకుంటున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నిరూపిస్తామని ఆయన అన్నారు. జగన్ వెంట ఉన్న శానససభ్యులు ఎప్పుడు, ఎలా బయటకు రావాలనేది తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయని, సమయమూ సందర్భాలను బట్టి వ్యూహాలు అమలవుతాయని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader YS Jagan lashed out at TDP president N Chandrababu Naidu today. He said that Chandrababu is fearing of YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X