వ్యక్తిగత సంబంధాల వల్లనే వైయస్ జగన్ను కలిశా: ఎమ్మెల్యే సికె బాబు
తాను కాంగ్రెసువాదినేని సికె బాబు అన్నారు. తాను గ్రూపు రాజకీయాలకు దూరమని ఆయన చెప్పారు. తన నియోజకవర్గం అభివృద్ధి తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన అన్నారు. గ్రూపు రాజకీయాలకు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధం లేదని మరో ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు. షాజహాన్ కూడా శనివారం ముఖ్యమంత్రిని కలిశారు.
జిల్లాలవారీగా అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును సమీక్షిస్తామని, సమీక్ష తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం ఉదయం నగిరిపల్లిలోని తన ఇంటికి వచ్చారు.
Comments
English summary
MLA CK Babu said that he met YSR Congress party president YS Jagan twice with personal relations.
Story first published: Saturday, May 28, 2011, 12:04 [IST]