వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం మొండిచేయి
చక్రపాణి, అఫ్సరుద్దీన్, రెడ్డప్పరెడ్డి, ఎం. రాజేశ్వర రావు, నాగలక్ష్మీదేవి పేర్లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది. అయితే ఈ జాబితాను కాంగ్రెసు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, తాను ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టబోనని వైయస్ వివేకానంద రెడ్డి పులివెందులకు పోటీ చేసే సమయంలో ప్రకటించారు. ఇటీవల ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. వైయస్ వివేకానంద రెడ్డి తన మాటను వెనక్కి తీసుకోకపోవడం వల్లనే ఎమ్మెల్సీగా ఎంపిక చేయలేదా అనే విషయం తేలాల్సి ఉంది.
English summary
YS Vivekanda Reddy's name is not in the MLC candidares list to be elected from Governor quota.
Story first published: Saturday, May 28, 2011, 15:29 [IST]