పిసిసి రేసులో పొన్నాల లక్ష్మయ్య, ఎజెండాలో మంత్రి వర్గ ప్రక్షాళన?

శాసనసభ స్పీకర్గా నాదెండ్ల పేరు ఖరారైనట్లే. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక కోసం శాసనసభ సమావేశమవుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం రాజీనామా చేశారు. డిప్యూటీ స్పీకర్గా ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ విప్గా ఉన్న మల్లుభట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ చీఫ్ విప్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశాలున్నాయి. పనిలో పనిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుడుతున్నారు. దామోదరం రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications